న్యూఢిల్లీ, అక్టోబర్ 21: ఈ-కామ ర్స్ కంపెనీలకు ఈ పండుగ సీజన్ కలిసొచ్చింది. దసరా సందర్భంగా తెచ్చిన ఆన్లైన్ సేల్స్లో.. తొలి వారం దాదా పు రూ.47,000 కోట్లుగా అమ్మకాలు నమోదయ్యాయి. ఈ మేరకు మార్కెట్ రిసెర్చ్ సంస్థ రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తెలిపింది. నిరుడుతో పోల్చితే ఈసారి సుమారు 19 శాతం వృద్ధి కనిపించినట్టు పేర్కొన్నది. ఒక్క ఫ్లిప్కార్ట్ గ్రూప్ విక్రయాలే ఇంచుమించు 63 శాతం పెరిగినట్టు చెప్తున్నది. దీంతో మొత్తం అమ్మకాల్లో రూ.29,610 కోట్ల వాటా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ గ్రూప్ నుంచి ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్సీల్లో అమ్మకాలు నడుస్తున్న విషయం తెలిసిందే.