Retirement Plan | వేతన జీవులైనా.. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లైనా.. ప్రభుత్వోద్యోగులైనా.. కంపెనీ కార్మికులైనా.. ఆఫీసర్లయినా.. ప్రతి ఒక్కరికీ రిటైర్మెంట్ జీవితం ఉంటది. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితం మెరుగ్గా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. 60 ఏండ్ల తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్య, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు.. రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు.. వివిధ సేవల చార్జీలు పెరుగుతాయి.. అంటే ద్రవ్యోల్బణం నిరంతరం పెరిగిపోతూనే ఉంటుంది. అలా పెరిగిపోయే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం ఎలా.. వచ్చే ఆదాయం పొదుపు చేయడం ఎలా అన్న సంగతి ముందుగా తెలుసుకోవాలి.
రిటైర్మెంట్ ప్రణాళికలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి వేతన జీవి తన పెట్టుబడి కెపాసిటీ, లక్ష్యాలు, రిస్క్, నెలవారీ ఆదాయం, ద్రవ్యోల్బణం, మధ్యలో ఎదురయ్యే అత్యవసర ఖర్చులు కూడా ఆ ప్రణాళికలో భాగంగా ఉండేలా చూసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత పెరుగుతున్న ద్రవ్యో్ల్బణం రిటైర్మెంట్ నిధిపై ఒత్తిళ్లు పెంచుతూ ఉంటుంది. కనుక పలు దశాబ్దాల పాటు మీ పెట్టుబడులు ఉండేలా.. అంటే భవిష్యత్ అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని ఎక్కువ శాతం పెట్టుబడులు మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
రిటైర్మెంట్ తర్వాత కొందరి ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. మరికొందరి ఆదాయం ఆగిపోతుంది. కానీ పెరిగిన ఆయురార్థంతో రిటైర్మెంట్ తర్వాత దాదాపు 20 నుంచి 30 ఏండ్ల జీవితం ఉంటది. అయితే, ద్రవ్యోల్బణం వల్ల ఔషధాలు, ఆహార వస్తువుల ధరలు నిత్యం పెరుగుతుంటాయి. మనదేశంలో ఏటా సగటున ఆరు శాతం ద్రవ్యోల్బణం నమోదవుతున్నది.
ఇక ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ద్రవ్యోల్బణం సుమారు 10 శాతం నమోదవతుంది. కనుకన రిటైర్మెంట్ లక్ష్యాల కోసం ఆదా చేస్తున్నప్పుడు ఇప్పటి విలువ, ధరలను పరిగణనలోకి తీసుకోకుండా.. భవిష్యత్ అవసరాలు.. ధరలను అంచనా వేయాలి. ఇప్పుడు 40 ఏండ్ల వయస్సు గల వేతన జీవి రూ.20 వేలు ఖర్చు చేస్తున్నాడనుకుందాం .. రిటైర్మెంట్ తర్వాత సుమారు రూ.90 వేల వరకు ఖర్చులు రావచ్చు.
పెరిగే ధరలకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకోవాలి. మీ వయస్సు 40 ఏండ్లు ఉంటే 60 ఏండ్లకు రిటైర్ అవుతారు. ఇప్పుడు నెలకు రూ.20 లేదా రూ.30 వేలు ఖర్చు చేస్తే.. ప్రస్తుతం పెరుగుతున్న ఆరు శాతం ద్రవ్యోల్బణం ప్రకారం 20 ఏండ్ల తర్వాత సుమారు రూ.లక్ష వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది.
80 ఏండ్ల వరకూ నివసించడానికి వీలుగా రిటైర్మెంట్ నిధి ముందే సమకూర్చుకోవాలి. అంటే 35-40 ఏండ్ల వయస్సు నుంచే ప్రతి నెలా రూ.20 నుంచి రూ.30 వేల వరకు పొదుపు చేసి.. వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుండాలి. దీనిపై 12 శాతం వడ్డీ ప్రకారం రిటైర్మెంట్ నాటికి మీ రిటైర్మెంట్ ఫండ్ సుమారుగా రూ.5 కోట్లకు చేరుతుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడిపై 6-7 శాతం వడ్డీ ఆదాయం మాత్రమే వస్తుంది. అటువంటప్పుడు మీరు రెట్టింపు పొదుపు చేయాలి.
ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మెరుగైన ఆదాయం పొందాలంటే మార్గం కేవలం ఈక్విటీ మార్కెట్లే. స్టాక్ మార్కెట్లలో నేరుగా, పరోక్షంగా పెట్టుబడులు పెట్టొచ్చు. రిస్క్ తీసుకునేందుకు సిద్ధ పడితే నేరుగా స్టాక్స్లో పెట్టుబడులు పెడితే.. ప్లాన్ ప్రకారం ముందుకెళితే మెరుగైన ఆదాయం సంపాదించొచ్చు.
ప్రతి ఒక్కరూ వేర్వేరు పెట్టుబడి మార్గాల్లో మదుపు చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారంల్లో పెట్టుబడులు పెట్టడం మరిచిపోవద్దు. ఈక్విటీ మార్కెట్లు, ఈటీఎఫ్ ల్లో 40 శాతం, బాండ్లు, పీఎఫ్, ఎన్పీఎస్ వంటి స్కీమ్స్ లో 60 శాతం పెట్టుబడి పెడితే మంచి పెన్షన్ కూడా వస్తుంది.