హైదరాబాద్, ఏప్రిల్ 11: రెడీ-టూ-ఈట్ ఫుడ్ రంగంలో ఉన్న హైదరాబాదీ సంస్థ ‘ది టేస్ట్ కంపెనీ’..అంతర్జాతీయ దేశాల్లో అడుగుపెట్టింది. వ్యాపార విస్తరణలో భాగంగా యూఏఈలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు, భవిష్యత్తులో బ్రిటన్, అమెరికా, సింగపూర్ దేశాల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో అనిల్ కుమార్ తెలిపారు.
ప్రస్తుతం సంస్థ ఐదు రకాల అల్పాహారాలతోపాటు ఏడు రకాల వెజ్ మీల్స్, ఆరు రకాల నాన్-వెజ్ మీల్స్లను కలుపుకొని మొత్తంగా 18 రకాల ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, హైదరాబాద్కు సమీపంలో రూ.34 కోట్ల పెట్టుబడితోఅడ్వాన్స్డ్ డీహైడ్రేషన్, ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీతో ప్లాంట్ను నెలకొల్పినట్లు తెలిపారు. నెలకు 30 లక్షల బాక్స్లను తయారు చేయగల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో 120 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్లతోపాటు ఇతర ఈ-కామర్స్ సంస్థలు, కంపెనీ పోర్టల్ ద్వారా మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపారు.