నూఢిల్లీ, ఫిబ్రవరి 13: బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒక్కరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నది.
సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి.