కొలంబో, మే 7: అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 ఏండ్లపాటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి శ్రీలంక ప్రభు త్వం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అక్కడి విద్యుత్తు శాఖ మంత్రి కాంచన విజెశేఖర మంగళవారం తెలిపారు.
కాగా, కిలోవాట్ పర్ అవర్ ధర 0.0826 డాలర్లు (24.76 శ్రీలంక రూపాయలు) గా నిర్ణయించారు. ఇదిలావుంటే ఈ ఒప్పందంలో భాగంగా శ్రీలంకలోని మ న్నార్, పూనెరిన్లలో 484 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం కలిగిన పవన విద్యుదుత్పత్తి కేంద్రాలను అదానీ గ్రీన్ ఎనర్జీ ఏర్పాటు చేస్తున్నది.