ముంబై, సెప్టెంబర్ 20: రికార్డు స్థాయిలో ప తనమైన రూపాయి విలువ ఎట్టకేలకు కోలుకున్నది. చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిన మా రకం విలువ బుధవారం ఒకేరోజు 21 పైసలు పెరిగి 83.11 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు శాంతించడం, విదేశీ మార్కెట్లో డాలర్ బలహీనంగా ఉండటంతో రూపాయి విలువ భారీగా లాభపడింది. రుపీ పతనాన్ని కట్టడి చేయడానికి రిజర్వు బ్యాంక్ తీసుకున్న చర్యలు ఎట్టకేలకు సత్ఫలితాలనిచ్చాయని ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు.
గత నాలుగు సెషన్లుగా మారకం విలువ పడిపోయి న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కె ట్లో ఇంధన ధరలు భగ్గుమనడంతో మరోసారి ద్రవ్యోల్బణ గణాంకాలు పెరుగుతాయన్న భయాలు ఫారెక్స్ మార్కెట్పై కనిపించాయి. మరోవైపు, బుధవారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 3,110 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.