అమెరికా వడ్డీరేట్ల త్వరితంగా తగ్గవని సంకేతాలిస్తూ అక్కడి ఆర్థిక గణాంకాలు బలంగా వెలువడుతున్నప్పటికీ భారత్తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదొడుకులన్నప్పటికీ సానుకూలంగా ముగిశాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 గతవారం 1.19 శాతం పెరిగి 22,041 పాయింట్ల వద్ద ముగిసింది. ఇందుకు భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడం, పారిశ్రామిక ఉత్పత్తి పెరగడం సహకరించాయి. ఈ నేపథ్యంలో ఈవారం సైతం ట్రెండ్ పాజిటివ్గా ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీ 20డీఎంఏ, 50 డీఎంఏ ఎగువన ముగియటం సానుకూల ట్రెండ్కు దోహదపడుతున్నదని సాంకో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ చెప్పారు. ఇప్పటి వరకు ఏ వారంలో ముగియనంత గరిష్ఠ స్థాయిలో నిఫ్టీ ముగియటం పాజిటివ్నెస్ను సూచిస్తున్నదని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా తెలిపారు.
ఈవారం ఒడిదొడుకులు ఏర్పడితే తక్షణం 21,800 స్థాయి మద్దతు ఇవ్వవచ్చని 22,400 దిశగా కదలవచ్చని ఛాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమిత్ బగాడియా అంచనావేశారు. ఈ వారం 22,222 స్థాయి నిరోధాన్ని కల్పించవచ్చని, ఆ స్థాయిని దాటితే 22,300 స్థాయిని అందుకోవచ్చునని జిమిత్ మోదీ విశ్లేషించారు. వీక్లి మద్దతు 21,650 వద్ద ఉన్నదన్నారు.