ముంబై, డిసెంబర్ 7: వరుసగా ఏడు రోజులపాటు జరిగిన మార్కెట్ ర్యాలీకి గురువారం బ్రేక్పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ప్రధాన సూచీలు స్వల్పంగా తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 132 పాయింట్లు క్షీణించి 69.522 పాయిం ట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 36 పాయింట్లు తగ్గి 20,901 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినప్పటికీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) అమ్మకాల ఒత్తిడితో సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. శుక్రవారం రిజర్వ్బ్యాంక్ తన ద్రవ్య విధాన నిర్ణయం వెలువడనున్నందున, ట్రేడర్లు సైతం మార్కెట్కు దూరంగా ఉన్నారన్నారు.
5 లక్షల కోట్లకు ఎల్ఐసీ
కొద్దిరోజులుగా జరుగుతున్న మార్కెట్ ర్యాలీలో ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్న నేపథ్యంలో బీమా దిగ్గజం ఎల్ఐసీ తిరిగి రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను చేరింది. గురువారం ఎల్ఐసీ షేరు 5 శాతానికి పైగా పెరిగి 52 వారాల గరిష్ఠస్థాయి రూ. 785 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది రూ.800 స్థాయిని తాకింది. ఈ వారంలో ఎల్ఐసీ షేరు 19 శాతం ర్యాలీ జరిపింది. అయితే గతేడాది మే నెలలో జారీచేసిన ఐపీవో ధర రూ.949 స్థాయిని ఇప్పటివరకూ అందుకోలేకపోయింది.