న్యూఢిల్లీ, అక్టోబర్ 3: మూడు అసెస్మెంట్ సంవత్సరాలకు సంబంధించి రూ.84 కోట్ల పెనాల్టీని డిమాండ్ చేస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీచేసింది.
ఈ ఆర్డర్పై అప్పీలు చేయనున్నట్టు ఎల్ఐసీ తెలిపింది. 2012-13 అసెస్మెంట్ ఏడాదికి రూ.12.61 కోట్లు, 2018-19కి రూ.33.82 కోట్లు, 2019-20కి రూ.37.58 కోట్ల చొప్పున పెనాల్టీ విధించినట్టు కంపెనీ వివరించింది.