న్యూఢిల్లీ : ఒకప్పుడు వీల్స్ ఆఫ్ ఇండియాగా భారత రోడ్లపై దూసుకెళ్లిన ఐకానిక్ అంబాసిడర్ కారు రెండేండ్లలో మళ్లీ దేశీ మార్కెట్లోకి సరికొత్త లుక్తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. లేటెస్ట్ డిజైన్, అంబాసిడర్ ఇంజన్పై హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఎంఎఫ్సీఐ), ఫ్రాన్స్ ఆటోమొబైల్ కంపెనీ పీగట్ కసరత్తు సాగిస్తున్నాయి.
హిందుస్ధాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్లో అంబాసిడర్ న్యూ మోడల్ తయారీ చేపట్టనున్నారు. అంబాసిడర్ న్యూ లుక్పై పనులు జరుగుతున్నాయని హిందుస్ధాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తం బోస్ వెల్లడించారు. 1990 ప్రాంతాల్లో ఆర్ధిక సరళీకరణ విధానాలతో పీగట్ భారత్లో కాలుమోపింది. 1960 నుంచి 1990 మధ్య వరకూ అంబాసిడర్ కారు భారత్లో స్టేటస్ సింబల్గా వెలుగొందింది. అప్పట్లో అంబాసిడర్ ఒక్కటే మార్కెట్లో భారీ ఎత్తున ఉత్పత్తి కాబడిన లగ్జరీ కారుగా పేరొందింది.
ఇక 2013-14 నాటికి అంబాసిడర్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1980ల్లో 20,000 యూనిట్ల వరకూ ఉన్న వార్షిక అమ్మకాలు క్రమంగా 2000 యూనిట్లకు పడిపోవడంతో 2014లో ఐకానిక్ కారు ఉత్పత్తి నిలిచిపోయింది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ పతనమవడంతో ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదని కంపెనీ వెల్లడించింది. 2017లో హిందుస్ధాన్ మోటార్స్ ప్రమోటర్ సీకే బిర్లా గ్రూప్ అంబాసిడర్ కారు బ్రాండ్ను ఫ్రాన్స్ ఆటో దిగ్గజం పీగట్కు రూ 80 కోట్లకు విక్రయించింది.