ముంబై, జనవరి 10: భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివేదిక ఒకటి తెలిపింది. 2019 తర్వాత ఇంత తక్కువ పీఈ నిధులు రావడం ఇదే ప్రధమం. ఆ ఏడాది 15.8 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు వచ్చాయి. ముఖ్యంగా స్టార్టప్ల్లోకి రెండేండ్లపాటు ఉప్పెనలా తరలివచ్చిన పీఈ నిధులు 2022లో గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, మాంద్యం భయాల కారణంగా తాజా పెట్టుబడులకు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విముఖత చూపుతున్నారని ఫైనాన్షియల్ మార్కెట్ల తీరుతెన్నుల్ని వివరించే రిఫినిటివ్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పీఈ పెట్టుబడులపై రిఫినిటివ్ గ ణాంకాల వివరాలు..