న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే 2024-25కి కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఈ మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల నుంచి వ్యయాల వివరాల్ని ఆర్థిక శాఖ ఆహ్వానించింది. ఈ మధ్యంతర బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1న సమర్పించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో లోక్సభ ఎన్నికలు జరగనున్నందున, ముందుగా మధ్యంతర బడ్జెట్నే సమర్పిస్తారు. ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది.
వ్యయ కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖలతో బడ్జెట్ ముంద స్తు సమావేశాలు 2023 అక్టోబర్ రెండోవారంలో మొదలై నవంబర్ మధ్యవరకూ జరుగుతాయని ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ డివిజన్ సెప్టెంబర్ 1 తేదీతో సర్క్యులర్ జారీచేసింది. అక్టోబర్ 5నాటికల్లా అవసరమైన వివరాలు అందించేలా చూడాలని ఆర్థిక సలహాదార్లకు సూచించింది. బడ్జెట్ ముందస్తు సమావేశాలు ముగిసిన తర్వాత 2024-25 సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్ని ఖరారు చేస్తారు.