న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ.. తాజాగా దేశీయ మార్కెట్కు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్లాస్ టెక్నాలజీ అండ్ ఫీచర్స్తో తయారైన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,09,900గా నిర్ణయించింది. 3.22 గంటల్లో పూర్తి స్థాయిలో రీచార్జికానున్న బ్యాటరీతో 136 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
గంటకు 93 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చునని కంపెనీ సీఈవో విజయ కుమార్ తెలిపారు. 3 కిలోవాట్ల ఎల్ఎఫ్పీ బ్యాటరీతో 30 శాతం అదనంగా బ్యాటరీ లైఫ్ ఇవ్వనున్నదన్నారు. ఈ స్కూటర్పై కశ్మీర్ నుంచి కణ్యాకుమారి వరకు రైడ్ చేశారు.