హైదరాబాద్, ఏప్రిల్ 23: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో..డాటా వినిమయంలో దూసుకుపోతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరినాటికి తన నెట్వర్క్లో డాటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ టెలికం దిగ్గజం చైనా మొబైల్ను అధిగమించినట్లు అయింది.
గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డాటా ట్రాఫిక్ దాదాపు 35.2 శాతం పెరిగింది. మరోవైపు, 2018లో భారత్లో నెలవారీ మొబైల్ డాటా ట్రాఫిక్ 4.5 ఎక్సాబైట్లు ఉండగా..కరోనా తర్వాత వార్షిక డాటా ట్రాఫిక్ 2.4 రెట్లు పెరిగింది. అలాగే తలసరి నెలవారీ డాటా వినియోగం మూడేండ్ల క్రితం కేవలం 13.3 జీబీ ఉండగా, ప్రస్తుతం ఇది రెండు రెట్లు పెరిగి 28.7 జీబీకి చేరుకున్నది.