తీవ్ర ఒడిదుడుకుల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే.. సెన్సెక్స్ 112.09 పాయింట్లు పడిపోయి 85,041.45 దగ్గర నిలిచింది. నిఫ్టీ 75.90 పాయింట్లు దిగజారి 26,042.30 వద్ద స్థిరపడింది. ఇక ఈ వారం విషయానికొస్తే.. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కాస్త కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నా.. ఇంకా ఆల్టైమ్ కనిష్ఠ స్థాయి దరిదాపుల్లోనే కొట్టుమిట్టాడుతున్నది.
ఈ క్రమంలో మళ్లీ నష్టాలకు లోనైతే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతినవచ్చు. అయితే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతిస్తే.. సూచీలు లాభాల్లో పరుగులు తీయవచ్చు. ఇక ఎప్పట్లాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, ఇతర అంతర్జాతీయ పరిణామాలూ కీలకమే. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 25,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 25,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 26,200-26,400 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహ జం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనా ల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించ దు. ఎవరి పెట్టుబడులకు వారిదే బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.