న్యూఢిల్లీ, డిసెంబర్ 5: టాటా మోటర్స్ కూడా ధరలు పెంచే ఆలోచనలో ఉన్నది. వచ్చే నెల నుంచి ప్యాసింజర్ వాహన ధరలను పెంచడానికి కసరత్తు చేస్తున్నది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రాను న్న ఉద్గారానికి సంబంధించిన మార్గదర్శకాలతో సంస్థపై పడనున్న భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచాలనుకుంటున్నట్లు టాటా మోటర్స్ ఎండీ శైలేష్ చంద్ర సూచనప్రాయంగా తెలిపారు.
ఇప్పటికీ కమోడిటీ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ వచ్చే త్రైమాసికంలో మాత్రం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇదే సమయంలో బ్యాటరీల ధరలు భారీగా పెరుగుతుండటం కొంతమేర ఆటోమొబైల్ సంస్థలకు ఇబ్బందేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంస్థ పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.