న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: రుణపీడిత టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.44 శాతం వాటా వచ్చింది. ప్రభుత్వానికి రూ.10 ముఖ విలువ కలిగిన రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల కేటాయింపులకు తమ బోర్డు ఆమోదించినట్టు మంగళవారం వొడాఫోన్ ఐడియా తెలియజేసింది. దీంతో కేంద్రానికి 33.44 శాతం వాటా దక్కినైట్టెంది.
కాగా, స్పెక్ట్రం వేలం చెల్లింపులు, ఏజీఆర్ బకాయిల వాయిదాల నేపథ్యంలో వడ్డీ బాకీలను తీర్చడంలో భాగంగానే ఈ వాటాను కేంద్ర ప్రభుత్వానికి వొడాఫోన్ ఐడియా ఇస్తున్నది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజీలకు సంస్థ తెలియజేసింది.