Financial Fraud | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆర్థిక మోసాలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.4 లక్షల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి అధ్యక్షతన శుక్రవారం ఆర్థిక సేవల రంగంపై సైబర్ దాడులపై ప్రత్వేక సమావేశం నిర్వహించారు.
దేశవ్యాప్తంగా ఆర్థిక మోసాలు పాల్పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారని, వీటిని అరికట్టడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు, ముఖ్యంగా పోలీసులు, బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలతో కలిసి ప్రత్యేక ప్లాట్ఫాంను ఏర్పాటు చేసింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపిన 35 లక్షల సంస్థలపై కూడా చర్యలు తీసుకున్నది. అలాగే ఇప్పటి వరకు 3.08 లక్షల సిమ్లను బ్లాక్ చేసిన కేంద్రం..500 మందిని అరెస్ట్ చేసింది.