న్యూఢిల్లీ, మార్చి 8: మనీ లాండరింగ్ చట్టం కిందకు క్రిప్టో వ్యాపారాలు, లావాదేవీలను తీసుకొస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మోదీ సర్కారు ఓ గెజిట్ నోటిఫికేషన్నూ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన ఈ ప్రకటన ప్రకారం క్రిప్టో ఎక్సేంజీలు, వాటి సంరక్షకులు, వ్యాలెట్ ప్రొవైడర్లుసహా యావత్తు క్రిప్టో బిజినెస్ ట్రేడింగ్.. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 కిందకు వస్తుంది. దీంతో అన్ని లావాదేవీల వివరాలను తప్పక పేర్కొనాల్సిందే. ఈ ట్రేడర్స్ను ‘రిపోర్టింగ్ ఎంటిటీ’లుగా కేంద్రం పేర్కొన్నది. అలాగే ఎక్సేంజీలు, మధ్యవర్తులు తమ క్లయింట్లు, లబ్ధిదారులకు సంబంధించి కేవైసీ నిబంధనల్ని పాటించాల్సిందే. కనీసం ఐదేండ్లపాటు అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాలి. ముఖ్యంగా రూ.10 లక్షలకుపైగా ఉన్న లావాదేవీలను భద్రపర్చాల్సిందే.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను నిరుడు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నును వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డిజిటల్ అసెట్స్ను పన్ను పరిధిలోకి తేవడమేగాక, పరిమితి దాటితే వీటి లావాదేవీలపై 1 శాతం టీడీఎస్నూ విధించారు. చివరకు క్రిప్టో, డిజిటల్ ఆస్తుల్లో బహుమతులపైనా పన్నుంటుందని స్పష్టం చేశారు. దీంతో క్రిప్టోకరెన్సీని చట్టబద్ధం చేసినైట్టెంది. తాజాగా మనీ లాండరింగ్ కిందకూ ఈ లావాదేవీలను తేవడంతో ఈ రంగానికి మరింత గుర్తింపును ప్రభుత్వం ఇచ్చినైట్టెంది. నిజానికి క్రిప్టోకరెన్సీ లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పట్నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే.