న్యూఢిల్లీ, జూలై 31: కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ల రూపంలో రూ.3,400 కోట్ల నిధులు లభించాయి. వీటిలో ఎన్ఐఐఎఫ్ రూ.3,031 కోట్లు, ఈసీజీసీ నుంచి రూ.434 కోట్లు వచ్చాయని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా తెలియజేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.5,200 కోట్లు డివిడెండ్ రూపంలో లభించినట్లు అయ్యాయి.