న్యూఢిల్లీ, జూలై 18: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ అడాగ్ సంస్థల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ శనివారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్), రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్)లపై నమోదైన కేసుల విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబైలోని 15చోట్ల ఈ తనిఖీలు జరిగాయని సీబీఐ అధికారులు తెలిపారు.
మొత్తం ఆర్ అడాగ్కు చెందిన 23 అనుబంధ సంస్థల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగినట్టు ఓ ప్రకటనలో సీబీఐ స్పష్టం చేసింది. బ్యాంకుల నుంచి ఆర్సీఎఫ్ఎల్, ఆర్హెచ్ఎఫ్ఎల్ సమీకరించిన నిధులను ఈ కంపెనీల ద్వారా పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి.