హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): టీ హబ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నుంచి వచ్చిన బోల్ట్ ఎర్త్ ఈవీ స్టార్టప్కు 20 మిలియన్ల డాలర్ల నిధులు సమకూరాయి.
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ వంటి మౌలిక వసతులు కల్పిస్తూ ఏర్పాటైన బోల్ట్ ఎర్త్ స్టార్టప్కు పెద్ద మొత్తంలో నిధులు రావడం పట్ల టీ హబ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 1100 నగరాల్లో 3 వేల చార్జింగ్ పాయింట్లను ఇప్పటికే ప్రారంభించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.