Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): అమెరికన్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ హైదరాబాద్లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ భారీ సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గత 10 ఏండ్లుగా సేవలను అందిస్తున్న కంపెనీ అతి పెద్ద కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉన్నదని,
పనిచేసే విధానాన్ని, డిజిటల్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవటంపట్ల వారి నిబద్ధతకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. సర్వీస్ నౌ వైస్ ప్రెసిడెంట్, ఎండీ కమోలికా గుప్తా పెరెస్ మాట్లాడుతూ.. అమెరికా బయట ఉన్న సెంటర్లలో ఇదే అతిపెద్దదని, ఈ డెవలప్మెంట్ సెంటర్తో తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.