న్యూఢిల్లీ : కియా ఇండియా భారత్లో ఆల్ న్యూ కియా కారెన్స్ త్రీ రో ఎస్యూవీని ఈనెల 16న లాంఛ్ చేస్తోంది. రిక్రియేషనల్ వెహికల్గా వినూత్న కాన్సెప్ట్తో ఈ కారును డిజైన్ చేశామని కియా చెబుతోంది. ఈ కారు మార్కెట్ లాంఛ్ వచ్చే ఏడాది తొలి క్వార్టర్లో ఉండనుంది. న్యూ కియా కారెన్స్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తే హ్యుందాయ్ అల్కాజర్, టాటా సఫారీలకు దీటైన పోటీ ఇవ్వనుంది.
నూతన డిజైన్ ఎలిమెంట్స్తో పాటు న్యూ కియా కారెన్స్ అత్యాధునిక ఫీచర్లు, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఆకట్టుకుంటుందని కియా ఇండియా ఎండీ, సీఈఓ ఏజిన్ పార్క్ వెల్లడించారు. భారత మార్కెట్లో తమ నాలుగో ప్రోడక్ట్ను సగర్వంగా లాంఛ్ చేస్తున్నామని, కియా కారెన్స్ను భారత్ అర్బన్ లైఫ్స్టైల్, రోడ్లకు అనుగుణంగా మూడు వరుసల సీటింగ్ కాన్ఫిగరేషన్, ఫీచర్లతో రిక్రియేషన్ వెహికల్గా తీర్చిదిద్దామని చెప్పారు. కియా కారెన్స్ గేమ్ ఛేంజర్గా నిరూపించుకుంటుందని విశ్వాసంతో ఉన్నామని అన్నారు.