విలువ, ఆస్తులను పెంచుకోవడం కోసం అదానీ గ్రూప్ తమ సంస్థల స్టాక్ ధరల్లో అక్రమాలకు పాల్పడిందనడానికి తాజాగా మరో సాక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గౌతమ్ అదానీకి ఉన్న సంబంధాల వల్లే దర్యాప్తు సంస్థలు, ఇతర రెగ్యులేటరీ అథారిటీలు అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాయి. అదానీ కంపెనీల్లోకి వచ్చిపడుతున్న విదేశీ నిధులపై 2014లోనే భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ దృష్టి పెట్టిందని తాజా నివేదికలో ఓసీసీఆర్పీ పేర్కొన్నది. కానీ ఆ తర్వాత ఈ వ్యవహారంపై ఏ రకమైన విచారణల్లేవు. కారణం.. మోదీతో అదానీకున్న సన్నిహిత సంబంధాలే. ఓసీసీఆర్పీ రిపోర్టు నేపథ్యంలో ఈ అంశంలో సమగ్ర దర్యాప్తు చాలా అవసరం. నిజాల నిగ్గు తేల్చడానికి సుప్రీం కోర్టులో విచారణ జరగాలి.
-సీపీఎం