Gadkari On Tesla | భారత్లో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తే అమెరికాకు చెందిన టెస్లా బెనిఫిట్లు పొందొచ్చునని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ వినియోగ కార్లతో పోలిస్తే అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గే రోజులు ఎంతో దూరంలో లేవని సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.
గత నెల 26న గడ్కరీ మాట్లాడుతూ ఒకవేళ టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను దేశంలో తయారు చేయడానికి సిద్ధ పడితే ఏ సమస్యా లేదన్నారు. కానీ చైనా నుంచి మాత్రం దిగుమతి చేయొద్దన్నారు. రైసినా డైలాగ్లో భాగంగా జరిగిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడుతూ `ఒకవేళ ఎలన్మస్క్ (టెస్లా సీఈవో) భారత్లో కార్లను తయారు చేయడానికి సిద్ధపడితే ఏ సమస్యా లేదు. భారత్కు రండి. భారత్ చాలా పెద్ద మార్కెట్. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి కూడా చేయొచ్చు` అని అన్నారు.
పన్ను రాయితీలు పొందాలంటే టెస్లా సీఈవో తొలుత తన ఐకానిక్ కార్లను భారత్లో ఉత్పత్తి చేయాలని గతేడాది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. విదేశాల నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకుని తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లపై కస్టమ్స్ డ్యూటీ 60-100 శాతం మధ్య ఉంటుంది.