న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా టెలికం సబ్స్ర్కైబర్లు మరింత పెరిగారు. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంఖ్య 119.7 కోట్లకు చేరుకున్నట్లు ట్రాయ్ వెల్లడించింది. వీరిలో అర్బన్ టెలిఫోన్ సబ్స్ర్కైబర్లు 66.37 కోట్లకు చేరుకోగా, రూరల్ సబ్స్ర్కైబర్లు 53.13 కోట్లకు చేరుకున్నారు.
అలాగే బ్రాడ్బ్యాండ్ సబ్స్ర్కైబర్లు 91.10 కోట్ల నుంచి 91.67 కోట్లకు పెరిగారని తన నెల సమీక్షలో తెలిపింది. మొత్తం బ్రాడ్బ్యాండ్ సబ్స్ర్కైబర్లలో టాప్-5 సంస్థల వాటా 98.35 శాతంగా ఉన్నది.