ముంబై : గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు , వెనకకు కదలాడుతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్,ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.
కొటాక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే ఇండియా, మారుతీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్,అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, యాక్సిస్ బ్యాంక్షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఒమిక్రాన్ వల్ల మరికొన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఆశించినంత లాభాలు కనిపించడం లేదు.