హైదరాబాద్, ఫిబ్రవరి 14: దేశీయ టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తున్నది. ఇప్పటికే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్న ఈ కృత్రిమ మేధస్సు భవిష్యత్తులోనూ పెద్దపీట లభించనున్నది. 2026 నాటికి ఏఐ నిపుణులు 10 లక్షల మంది అవసరమవుతారని టీసీఎస్ ప్రెసిడెంట్ వీ రాజన్న తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న హైసియా జాతీయ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని రంగాల్లో ముఖ్యంగా ఉత్పత్తి, వ్యవసాయ, హెల్త్కేర్, విద్య రంగాల్లో ఏఐ కీలకపాత్ర పోషిస్తున్నదన్నారు. 2023లో 150 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏఐ మార్కెట్ విలువ వచ్చే 2030 నాటికి సరాసరిగా ప్రతి ఏడాది 36.8 శాతం వృద్దిని నమోదు చేసుకోనున్నదన్నారు.