Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ముగిసిన ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.90 లక్షలు పెరిగింది. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా లబ్ధి పొందింది. రిలయన్స్తోపాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) లాభ పడ్డాయి. మరోవైపు, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ నష్టపోయాయి.
టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,90,267.98 కోట్లు పెరిగింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.1,38,290.85 కోట్లు పుంజుకుని రూ.19,72,028.45 కోట్లకు చేరుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.57,867.9 కోట్లు పెరిగి రూ.14,51,307.84 కోట్ల వద్ద నిలిచింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.33,467.29 కోట్లు, ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.26,153.87 కోట్లు పెంచుకున్నాయి.
మరోవైపు ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,931.64 కోట్లు, భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.5,231.18 కోట్లు పతనమైంది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ఐసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ నిలిచాయి.