TCS : దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ తన ఉద్యోగులకు కార్యాలయ నుంచి పనిచేయాలని తుది హెచ్చరిక జారీ చేసింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది. రిమోట్ వర్కింగ్ను సుదీర్ఘంగా కొనసాగిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని ఉద్యోగులను కంపెనీ హెచ్చరించింది.
మార్చి మాసాంతానికి కార్యాలయాల నుంచి పనిచేయక తప్పదని స్పష్టం చేసింది. ఉద్యోగులు ముఖాముఖి సంప్రదింపులతో కార్యాలయ వాతావరణంలో పనిచేస్తే మెరుగైన వ్యాపార ఫలితాలు చేకూరుతాయని టీసీఎస్ పలుమార్లు స్పష్టం చేసింది. టీసీఎస్ దశలవారీగా రిమోట్ వర్క్కు స్వస్తిపలికి మహమ్మారి ముందు రోజుల తరహాలో సాధారణ వర్క్ పాలసీ అమలయ్యేలా చర్యలు చేపడుతోంది.
ఇక కరోనా మహమ్మారి నెమ్మదించినా పలు గ్లోబల్ కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నిర్ధేశిత గడువులోగా ఉద్యోగులు విధిగా కార్యాలయాల నుంచి పనిచేయాలని, విరుద్ధంగా వ్యవహరించిన ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని టీసీఎస్ సీవోవో ఎన్జీ సుబ్రహ్మణ్యం తేల్చిచెప్పడంతో వర్క్ ఫ్రం ఆఫీస్ పట్ల కంపెనీ ఎంత పట్టుదలతో ఉందో వెల్లడవుతోంది.
Read More :
Youngest Billionaire: 27 ఏళ్లకే బిలియనీర్.. ఆ ఇండియన్ 90 రోజుల్లో ఎంత సంపాదించాడో తెలుసా