న్యూఢిల్లీ, జూన్ 9: వచ్చే మూడేండ్లలో ఉద్యోగులతో సమానంగా ఏఐ ఏజెంట్లను నియమించుకోనున్నట్టు టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. టీసీఎస్ 31వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉద్యోగులను తగ్గించుకునే యోచనేది లేదని, ఏఐ ఏజెంట్ల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
ప్రస్తుతం సంస్థలో ఐదు లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా, ఐదు లక్షల మంది ఏఐ ఏజెంట్లను నియమించుకునే రోజూ ఎంతో దూరంలో లేదని ఆయన స్పష్టంచేశారు.