న్యూఢిల్లీ : 2020-21 ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్పై పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ 3.35 లక్షల కోట్లకు ఎగబాకాయని, ఎక్సైజ్ సుంకం పెంపుతో రికార్డు వసూళ్లు నమోదయ్యాయని సోమవారం లోక్సభలో ప్రభుత్వం వెల్లడించింది. కరోనా మహమ్మారి తాకిడితో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పడిపోవడంతో ఆదాయం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ 19.98 నుంచి రూ 32.9కి పెంచింది.
ఇక డీజిల్పై లీటర్కు రూ 15.83 నుంచి రూ 31.8కి ఎక్సైజ్ సుంకాన్ని పెంచామని పెట్రోలియం సహజవాయు సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. దీంతో 2020-21లో పెట్రోల్, డీజిల్పై పన్నను వసూళ్లు 88 శాతం పెరిగి రూ 1.78 లక్షల కోట్ల నుంచి రూ 3.35 లక్షల కోట్లకు ఎగిశాయని తెలిపారు. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడం ఇతర నియంత్రణలు అమలవడంతో ఇంధన విక్రయాలు తగ్గడం ద్వారా పన్ను వసూళ్లు తగ్గాయని లేకుంటే పన్ను వసూళ్లు మరింత పెరిగేవని ఆయన చెప్పుకొచ్చారు.