న్యూఢిల్లీ, మే 3: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికరలాభం స్టాండెలోన్ ప్రాతిపదికన 2022 మార్చితో ముగిసిన నాల్గో త్రైమాసికంలో 37 శాతం వృద్ధితో రూ. 9,835.12 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో ఈ లాభం రూ. 7,162 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం రూ.50,300 కోట్ల నుంచి రూ. 69.616 కోట్లకు పెరిగినట్టు కంపెనీ స్టాక్ ఎక్ఛేంజీలకు తెలిపింది.
మంగళవారం సమావేశమైన టాటా స్టీల్ డైరెక్టర్ల బోర్డు షేర్లను 10:1 నిష్పత్తిలో విభజించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. ఒక్కో షేరును 10 షేర్లుగా విభజిస్తారు. అలాగే షేరుకు రూ. 51 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు సిఫార్సుచేసింది.