న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారత్ మార్కెట్లో అక్టోబర్ 18న ఆల్ న్యూ టాటా పంచ్ను లాంఛ్ చేస్తోంది. ఈ మినీ ఎస్యూవీ కోసం రూ 21,000 టోకెన్ అమౌంట్తో అక్టోబర్ 4 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టాటా పంచ్ లాంఛ్ అయిన తర్వాత టాటా నెక్సాన్, టాటా హారియర్, టాటా సఫారీల సరసన యంగెస్ట్ ఎస్యూవీ లైనప్గా నిలవనుంది. న్యూ టాటా పంచ్ మారుతి సుజుకి ఐగ్నిస్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్లతో పాటు రానున్న హ్యుందాయ్ కాస్పర్, సైట్రోన్ సీ3లకు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
న్యూ టాటా పంచ్ ఆర్కస్ వైట్, అటామిక్ ఆరంజ్, గ్రే, మెటియర్ బ్రౌన్, కలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టార్నడో బ్లూ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఎస్యూవీ రెండు ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్ కార్నర్ సేఫ్టీ కంట్రోల్, బ్రేక్ స్వే కంట్రోల్, ఫ్రంట్ పాగ్ ల్యాంప్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లతో లభిస్తోంది. ఆల్ న్యూ టాటా పంచ్ ప్రారంభ ధర రూ 5 లక్షలు (ఎక్స్షోరూం)పలుకుతుందని భావిస్తున్నారు.