Tata Punch | న్యూఢిల్లీ, జనవరి 17: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ.10.99 లక్షల నుంచి రూ.14.49 లక్షల లోపు లభించనున్నది.
రెండు బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ పంచ్..25 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్తో 315 కిలోమీటర్లు, 35 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ సింగిల్ చార్జింగ్తో 421 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నది. స్మార్ట్ డిజిటల్, ఫోన్ చార్జింగ్, 366 లీటర్ల బూట్స్పేస్, వాయిస్ అసిస్టెంట్స్ రూఫ్టాప్ వంటి ఫీచర్స్తో రూపొందించింది. కేవలం 9.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు నాలుగు రంగుల్లో లభించనున్నది.