హైదరాబాద్, డిసెంబర్ 2: దేశంలో కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్ మెగా బ్రాండ్ ఎక్స్పోకు సిద్ధమైంది. ఈ నెల 3 నుంచి 4 వరకు హైదరాబాద్ ఏస్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మహోత్సవ్లో చిన్న స్థాయి కమర్షియల్ వాహనాలను ఒక్కచోట ప్రదర్శించనున్నది. దీంట్లో ఏస్ గోల్డ్ డీజిల్ ప్లస్, ఏస్ గోల్డ్ పెట్రోల్ సీఎక్స్, ఏస్ గోల్డ్ పెట్రోల్ హై డెక్, ఏస్ గోల్డ్ సీఎన్జీ వంటి మోడళ్ళను అందుబాటులో ఉంచింది. 2005లో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ మోడల్కు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.