న్యూఢిల్లీ, జూన్ 12 : టాటా మోటర్స్ కూడా వాహన ధరలను పెంచేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 1.5 శాతం వరకు సవరించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇంటర్నల్ కంబూస్టన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ప్రియంకానున్నాయి. గడిచిన మూడు నెలల్లో ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం విశేషం.
ఏప్రిల్ 1న వాహన ధరలను సవరించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే వాహన ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం అధికం కావడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ధరలను స్వల్పంగా సవరించాల్సి వచ్చిందని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఇప్పటికే మారుతి, హ్యుందాయ్ సంస్థలు తమ వాహన ధరలను రూ.30 వేల వరకు పెంచిన విషయం తెలిసిందే.