Tata Motors Nexon Max | టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి తన నెక్సాస్ ఎలక్ట్రిక్ మ్యాక్స్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.17.74 లక్షల నుంచి రూ.19.24 లక్షల మధ్య ఉంటుందని ప్రకటించింది. నెక్సాన్ ఈవీ బ్యాటరీ కంటే 33 శాతం అధిక సామర్థ్యం.. అంటే 40.5 కిలోవాట్ల సామర్థ్యం గల లిథియం ఐయాన్ బ్యాటరీతో నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కారు రూపుదిద్దుకుంది. నిరంతరాయంగా 437 కి.మీ. దూరం ప్రయాణ సామర్థ్యం ఉంటుందని ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధృవీకరించింది.
నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్జడ్ ప్లస్, నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్జడ్ ప్లస్ లక్స్ వేరియంట్లలో లభ్యం కానున్నది. ఫ్రంట్ ప్యాసింజర్స్కు సీట్ వెంటిలేషన్, ఎయిర్ ఫ్యూరిఫయర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం, క్రూయిజ్ కంట్రోల్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు, 30 న్యూ అడిషినల్ సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. 105 కిలోవాట్ల విద్యుత్తోపాటు 250 ఎన్ఎం టార్చ్ సామర్థ్యం కలిగి ఉంటుంది.
3.3 కిలోవాట్ల చార్జర్తోపాటు మ్యాక్స్ ఎక్స్జడ్ ప్లస్ మోడల్ కారు ధర 17.74 లక్షలు పలికితే, 7.2 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్తోపాటు మ్యాక్స్ ఎక్స్జడ్ ప్లస్ వేరియంట్ రూ.18.24 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. ఎక్స్జడ్ ప్లస్ లక్స్ వేరియంట్ కారు 3.3 కిలోవాట్ల సామర్థ్యం గల చార్జర్తో రూ.18.74 లక్షలు, 7.2 కిలోవాట్ల ఫాస్ట్ చార్జర్తో రూ.19.24 లక్షలకు లభిస్తుంది. 7.2 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ చార్జర్ను ఆఫీసు లేదా ఇంటి వద్ద ఇన్స్టాల్ చేస్తారు. దీనివల్ల చార్జింగ్ టైం 6.5 గంటలకు తగ్గించొచ్చు.