Tata Safari#Dark | ప్రయాణికుల కార్ల మార్కెట్లో పట్టు సాధించే దిశగా టాటా మోటార్స్ దూకుడుగా ముందుకెళ్తున్నది. అందులో భాగంగా తన ప్రీమియం ఎస్యూవీ మోడల్ సఫారీ డార్క్ ఎడిషన్ను సోమవారం ఆవిష్కరించింది. దీని ధర రూ.19.05 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దేశవ్యాప్తంగా సంస్థ డీలర్షిప్ల వద్ద సఫారీ# డార్క్ ఎడిషన్ కార్లను ఆసక్తిగల కస్టమర్లు బుక్ చేసుకోవచ్చునని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇది ఎక్స్టీ+, ఎక్స్టీఏ+, ఎక్స్జడ్+, ఎక్స్జడ్ఏ+ ట్రిమ్స్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫస్ట్, సెకండ్ రోల్లో వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్ ఫ్యూరిఫయర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వై-ఫై తదితర ఫీచర్లు ఇందులో జత చేశారు.
అతి తక్కువ టైంలో టాటా సఫారీ #డార్క్ మోడల్ కారు తమ ప్యాసింజర్ వెహికల్స్లో న్యూ ఫరెవర్ రేంజ్లో ప్రధానంగా నిలుస్తుంది అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ వైస్ప్రెసిడెంట్ రాజన్ అంబా వ్యాఖ్యానించారు. కస్టమర్లకు ఇది పాపులర్ చాయిస్గా నిలుస్తుందన్నారు.
ఇప్పటికైతే పరిమిత ఎడిషన్ మాత్రమే విడుదల చేసినా.. పాపులర్ కస్టమర్ డిమాండ్ను బట్టి మున్ముందు హ్యారియర్ పోర్ట్ఫోలియోలో సమగ్ర భాగంగా సఫారీ#డార్క్ ఎడిషన్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ విషయమై తాము విశ్వాసంతో ఉన్నామన్నారు. టాటా సఫారీ ఎస్యూవీ మోడల్ కార్లు 16 వేలకు పైగా అమ్ముడయ్యాయి. లాండ్ రోవర్ లెజెండరీ డీ8 ప్లాట్ఫామ్ నుంచి రూపుదిద్దుకున్న ఒమెగార్క్ ఆర్కిటెక్చర్తో సఫారీ#డార్క్ ఎడిషన్ రూపుదిద్దుకుంది.