R Krishnakumar | రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
కృష్ణకుమార్ మృతి పట్ల టాటా గ్రూప్ స్పందించింది. టాటా సన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సంతాపం తెలిపారు. టాటా గ్రూప్నకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు కృష్ణకుమార్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం స్పందించారు. ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.
Deeply saddened to hear the passing of Padma Shri R. K. Krishnakumar, former #TataSons director and @TataCompanies veteran. Born in Thalassery, he was vital to many pivotal moves by the group, including strengthening ties with Kerala. Heartfelt condolences to family and friends.
— Pinarayi Vijayan (@pinarayivijayan) January 1, 2023
పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన ఆర్ కృష్ణకుమార్.. కేరళ తలస్సెరీలో పుట్టిపెరిగారు. చెన్నైలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన.. 1963లో టాటా గ్రూప్లో అడుగుపెట్టారు. అప్పటి నుంచి కంపెనీలో ఎంతో చురుగ్గా పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రతన్ టాటాకు మంచి ఆప్తుడైన కృష్ణకుమార్.. అతి తక్కువ సమయంలోనే టాటా సన్స్కు డైరెక్టర్గా, సంస్థలోని పలు కంపెనీల్లో టాప్ పొజిషన్కు చేరుకున్నారు. టాటా సంస్థలకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా పలు కీలక నిర్ణయాల్లో కృష్ణకుమార్ ముఖ్య భూమిక పోషించారు.