Imports | న్యూఢిల్లీ, మే 2: దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో దూసుకుపోయిన కేంద్ర సర్కార్కు దిగమతుల గణాంకాలు షాకిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 89.8 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స, టెలికం, ఎలక్ట్రికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది. వీటిలో సగం చైనా, హాంకాంగ్ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) వెల్లడించింది.
గడిచిన ఏడాదిగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దిగుమతులు మాత్రం ఆగడం లేదు. అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ రంగాలతో రోజుకు లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాత్సవ తెలిపారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి భారత్ దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, వీటిని తగ్గించుకోవాలంటే దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.