న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27:భారత్లో మధ్యస్థాయి సెడాన్ యారీస్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రకటించింది. దేశీయంగా ఈ మోడల్కు అంతంతే స్పందన ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నది. మే 2018లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కారు రూ.8.75 లక్షల నుంచి రూ.14.07 లక్షల మధ్యలో ధరను నిర్ణయించింది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్లకు పోటీగా నాలుగేండ్ల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం 20 వేల యూనిట్లు మాత్రమే అమ్ముడవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. అయినప్పటికీ సంస్థ.. హ్యాచ్బ్యాక్ గ్లాంజా, కాంప్యాక్ట్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్, మల్టీపర్పస్ వాహనమైన ఇన్నోవా క్రిస్టా, ప్రీమియం ఎస్యూవీ ఫార్చ్యూనర్ మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.