హైదరాబాద్, అక్టోబర్ 7: ఆభరణాల విక్రయ సంస్థ తనిష్క్..హైదరాబాద్లో ఒకేరోజు రెండు స్టోర్లను ప్రారంభించింది. దీంతో భాగ్యనగరంలో రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 12కి చేరుకున్నది. హిమాయత్నగర్లో 8,997 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద అవుట్లెట్ను ప్రారంభించిన సంస్థ..మరొకటి నల్లగండ్ల వద్ద 3,215 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది. ప్రారంభ ఆఫర్ కింద ఈ నెల 9 వరకు ప్రతి బంగారం కొనుగోలుపై ఉచితంగా నాణేలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో అజయ్ చావ్లా మాట్లాడుతూ.. వ్యాపార విస్తరణలో భాగంగా కొత్తగా ఈ రెండు స్టోర్లను ఏర్పాటు చేసినట్లు, దీంతో తెలంగాణతోపాటు ఏపీల్లో స్టోర్ల సంఖ్య 30కి చేరుకున్న దన్నారు.