Semi Conductor Park | చిప్లు.. సెమీ కండక్టర్లు.. కంప్యూటర్లు.. ల్యాప్టాప్లు, కార్లు మొదలు టూ వీలర్స్ తయారీలో కీలకం.. కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రం హోం లేదా లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి పెరిగిపోయింది. పర్సనల్ మొబిలిటీకి గిరాకీ ఎక్కువైంది. ఫలితంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది.. దీంతో కార్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ధరలు పెరిగిపోయాయి. తద్వారా సెమీ కండక్టర్లు, చిప్ల తయారీ కోసం భారత్ చేపట్టిన సన్నాహాలు ఒక కొలిక్కి వచ్చాయి.
సెమీ కండక్టర్ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఇన్సెంటివ్లు కూడా కల్పించింది. తమిళనాట సెమీ కండక్టర్ల పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న ఐజీఎస్ఎస్ వెంచర్స్తోపాటు మూడు సంస్థలు కేంద్రం ఇన్సెంటివ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తమిళనాట సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి.
హైటెక్ సెమీ కండక్టర్ పార్క్ ఏర్పాటు చేయడానికి అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)పై తమిళనాడు గైడెన్స్ బ్యూరోతోపాటు ఐజీఎస్ఎస్ వెంచర్స్ సంతకాలు చేశాయని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. చెన్నైకి సమీపంలోని రెండు సైట్లతోపాటు తొమ్మిది వ్యూహాత్మక సైట్లను కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వ గైడెన్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. దీనివల్ల రూ.25,600 కోట్ల పెట్టుబడులతోపాటు ఐదేండ్లలో 1500 ఉద్యోగాలు లభిస్తాయి.