చెన్నై, అక్టోబర్ 12: ట్రాక్టర్ల తయా రీ సంస్థ టఫే లిమిటెడ్.. దేశవ్యాప్త సర్వీస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రచారంతో ట్రాక్టర్ల మరమ్మత్తుకోసం సర్వీస్ సెంటర్లకు పోవాల్సిన అవసరంలేదని, ఇంటి వద్దనే మరమ్మత్తు చేసి ఇవ్వనుండటంతో ఖర్చు తగ్గడంతోపాటు ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీస్ను తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో 3 వేల మంది శిక్షణ పొందిన మెకానిక్లు పాల్గొంటున్నారని తెలిపింది. రబీ సీజన్లో ట్రాక్టర్ల డిమాండ్ అధికంగా ఉంటుందన్న అంచనాతో అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపింది.