Swaraj Tractor | మహీంద్రా అండ్ మహీంద్రా బ్రాండ్ కంపెనీ ‘స్వరాజ్’ శుక్రవారం మార్కెట్లోకి ‘స్వరాజ్ టార్గెట్’ లైట్వెయిట్ ట్రాక్టర్లను ఆవిష్కరించింది. పంట దిగుబడి పెంచడంతోపాటు వ్యవసాయంలో అన్నదాతల అవసరాలు తీర్చేలా ఈ ‘స్వరాజ్ టార్గెట్’ ట్రాక్టర్ రూపుదిద్దారు. ఈ ట్రాక్టర్ ధర రూ.5.35 లక్షల నుంచి మొదలవుతుంది. ఇదిలా ఉంటే ఇండియా క్రికెటర్లలో మిస్టర్ కూల్ మ్యాన్ ‘మహేంద్ర సింగ్ ధోనీ’ని తమ ప్రచారకర్తగా నియమించుకున్నది.
ప్రారంభదశలో 20-30 హెచ్పీ క్యాటగిరీలో టార్గెట్ 630 (Target 630), టార్గెట్ 625 (Target 625) వేరియంట్లను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. క్రిమి సంహారక మందుల పిచికారీకి వీలుగా స్ప్రే సేవర్ స్విచ్ టెక్నాలజీ, కార్ల తరహాలో గేర్ల షిప్టింగ్ కోసం సింక్ షిఫ్ట్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్టర్ ఇంజిన్ 87 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుంది.
టార్గెట్ 630 (Target 630) తొలుత మహారాష్ట్ర, కర్ణాటకలోని తమ డీలర్ నెట్వర్క్ల ద్వారా అందుబాటులోకి రానున్నట్లు స్వరాజ్ తెలిపింది. టార్గెట్ 625 (Target 625)ని మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి తీసుకొస్తామని పేర్కొంది. అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయని స్వరాజ్ వెల్లడించింది.
స్వరాజ్ ప్రచారకర్తగా నియమితులైన ఎంఎస్ ధోనీ స్పందిస్తూ.. ‘చిన్న పట్టణం నుంచి వచ్చా.. కానీ వ్యవసాయం అంటే రోజువారీ కేవలం రోజువారీ దిన చర్య మాత్రమే కాదు.. నన్ను ఎల్లవేళలా ఆకర్షించింది. కరోనా మహమ్మారి వేళ నేను ఎక్కువ టైం పొలంలోనే గడిపాను. వ్యవసాయం చేయడానికి శక్తిమంతమైన ట్రాక్టర్ కావాలని అప్పుడు తెలిసింది. దీంతో స్వరాజ్ ట్రాక్టర్ ఎంపిక చేసుకున్నా. ఆ ట్రాక్టర్తో అనుబంధం పెంచుకోవడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.