ముంబై, జూన్ 2: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ స్వరాజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్తగా కాంప్యాక్ట్ లైట్వేట్ మాడల్ను పరిచయం చేసింది. ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.5.35 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.
20-30 హెచ్పీ సామర్థ్యం కలిగిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్తో రూపొందించిన ఈ ట్రాక్టర్తో స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చును. తోటల పెంపకం కోసం వినియోగించే ట్రాక్టర్ల విభాగంలో ఈ నూతన మాడల్తో ప్రవేశించినట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా తెలిపారు.