ముంబై, ఆగస్టు 20: భారత్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పోటెత్తున్నది. దాంతో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 17.3 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమవుతాయని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అంచనావేసింది. గతేడాది అమ్మకాలతో పోల్చితే 2021లో ఈ వృద్ధి 14 శాతం. జూన్లో కొవిడ్ నియంత్రణలు తొలగిపోయిన తర్వాత డిమాండ్ పుంజుకున్నదని, ఆగస్టు నుంచి నవంబర్ వరకూ కొనసాగే పండుగల సీజన్లో అమ్మకాలు మరింత జోరందుకుంటాయని కౌంటర్పాయింట్ పేర్కొంది. ప్రస్తుత ఏడాది ద్వితీయార్థంలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లు భారత్కు దిగుమతవుతాయని అంచనా.
నివేదికలో ప్రధానాంశాలు:
5జీ ఫోన్లు…
2020లో 5జీ స్మార్ట్ఫోన్లు మొత్తం మార్కెట్లో 3 శాతానికంటే తక్కువ. 2021లో 5జీ హ్యాండ్సెట్ల అమ్మకాలు 8 రెట్లు పెరిగి 3.2 కోట్ల యూనిట్లకు చేరుకున్నాయి. దాంతో స్మార్ట్ఫోన్ల మార్కెట్లో 5జీ సెట్ల వాటా 19 శాతానికి పెరిగింది. ఉత్పత్తి కంపెనీల మధ్య పోటీకారణంగా 5జీ చిప్సెట్లు చౌకకావడంతో 5జీ హ్యాండ్సెట్ల ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం తక్కువధరగల 5జీ సెట్ రూ.15,000లోపునే లభిస్తున్నది. వచ్చే 12 నెలల్లో ఎంట్రీలెవల్ 5జీ స్మార్ట్ఫోన్ల ధర 40 శాతం తగ్గవచ్చు.