చెన్నై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ సుందరం ఫైనాన్స్ లిమిటెడ్.. వివిధ రకాల టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది.
ఏడాది డిపాజిట్లపై వడ్డీరేటును సాధారణ పౌరులకు 7.45 శాతానికి, రెండు, మూడేండ్ల డిపాజిట్లపై వడ్డీరేటును 7.75 శాతానికి సవరించింది. సీనియర్ సిటిజన్లకైతే ఏడాదికి 7.95 శాతం, రెండు, మూడేండ్లకు 8.25 శాతం వడ్డీరేటున్నది.